టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్ రమణ

 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే సైకిల్‌ దిగేశారు. తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పేశారు ఎల్‌.రమణ. నిన్న రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా రాజకీయ అంశాలపై చర్చించారు. ఇవాళ ఉదయం తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు లేఖ పంపారు. త్వరలోనే రమణ కారెక్కబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జగిత్యాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిపొందారు. ప్రస్తుత రాజకీయాల పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజీనామాలో పేర్కొన్నారు. ఇన్నాళ్లు తన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు రమణ. ప్రస్తుతం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో రమణ టీఆర్‌ఎస్‌కి వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.