టిఆర్ఎస్ 20వ ప్లీనరీ ...

తెలంగాణ  రాష్ట్ర సమితిపార్టీ(TRS)... టిఆర్ఎస్ 20వ ప్లీనరీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సెలెక్టు చేసిన ప్రజా ప్రతినిదులు ఈ ప్రోగ్రాం కు అటెండ్ అయ్యారు. ఈ ఇరవై ఎళ్లలో పార్టీ సాధించిన విజయాలను గడిచిన 7ఎళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని వివరించారు పార్టీ అధ్యక్షులు.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చెపట్టబోయే పలు తీర్మాణాలను సైతం ప్లీనరీలో అమోదించారు ప్రతినిధులు.  పనిలో పనిగా ప్రతిపక్షాలపై మండి పడ్డారు కేసిఆర్. అనేక సంక్షేమ పథకాలు కోత్త రాష్ట్రంలో అమలు అవుతున్నాయన్నారు. అనేక రంగాల్లో దేశంలోని చాలా రాష్ట్రాలకంటే ముందున్నామన్నారు.