జాతీయ పార్టీ ప్రకటించిన కెసిఆర్...

     ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటివరకు కొనసాగించిన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా(BRS)గా పేరు మారుస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో కెసిఆర్ అధ్యక్షతన తెరాస  సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో పార్టీ పేరు మారుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు... ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఇకనుండి జాతీయస్థాయిలో టిఆర్ఎస్ గా తన ప్రయాణాన్ని కొనసాగించనుంది.

     మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కీలక ప్రతినిధులు హాజరయ్యారు, ముఖ్యఅతిథిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వి సి కె పార్టీ అధ్యక్షుడు ఎంపీ తిరుమవలవన్, పలువురు ఇతర రాష్ట్ర నేతలు హాజరయ్యారు..