జయహో..... పీ వీ సిందుకు కాంస్యం

స్వర్ణ సౌరభాలకు దూరమైనా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు.. కాంస్య కాంతులు విరజిమ్మింది. రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తెలుగమ్మాయి.. టోక్యోలో కంచు ఖాతాలో వేసుకొని విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా చరిత్రకెక్కింది. సెమీస్‌లో తడబడిన సింధు..కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. చైనా షట్లర్‌ను కంగు తినిపిస్తూ అలవోక విజయాన్నందుకుంది.