జనసేన కార్యకర్తలపై వైసిపి కార్యకర్తల దాడి

గుంటూరు: గుంటూరు జిల్లా పాకాలపాడులో జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారాన్నిరెడ్డి సమాజిక వర్గనేతలు అడ్డుకున్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారానికి రావద్దు అంటూ ప్రచార రద్దానికి అడ్డంగా నిలబడి గొడవచేశారు. జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈదాడిలో చల్లాశ్రీనివాసరావు అనే యువకుడు గాయపడ్డాడు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల ప్రచారచేస్తుంటే భౌతిక దాడులకు పాల్పడటమేమిటని యర్రం వెంకటేశ్వరెడ్డి, కార్యకర్తలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా సతైనపల్లిలో రాస్తారోకో చేశారు. వైసిపి గుండాలు అరచకాం నశించాలని, అంబంటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.