చుక్కల మందు మరవద్దు

 చిన్నారులను పోలియో మహమ్మారి  కబళించ కుండా చేద్దాం.  వారి జీవితంలో  ఎలాంటి వైకల్యం లేకుండా ఉండేందుకు పోలియో చుక్కలు వేయిద్దాం. ఈ రోగాన్ని దేశం నుంచి తరిమి వేసేందుకు ప్రభుత్వం ఈరోజు పోలియో ఆదివారాన్ని నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల్లో ఉన్న 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారి నుండి  వారిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ సౌకర్యం దగ్గరలోని అంగన్వాడి సెంటర్ లు ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రయాణాల్లో ఉన్న కూడా  ఉపయోగించుకునేలా రైల్వే స్టేషన్లు లు, బస్టాప్ లు మరియు విమానాశ్రయాల్లో ను పోలియో చుక్కలు వేయించేందుకు  ఏర్పాట్లు  చేసింది ప్రభుత్వం. కాబట్టి  ఎట్టి పరిస్థితుల్లో  ఈ అవకాశాన్ని మిస్ చేయవద్దు.