"గాంధీలో దారుణం"

  • బ్రతికున్న వ్యక్తి చనిపోయినట్లు డిక్లేర్

సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో దారుణమైన ఘటన జరిగింది. బతికి ఉన్న వ్యక్తి చనిపోయినట్లుగా ధ్రువీకరించారు డాక్టర్లు.. 2 రోజుల క్రితం భాను అనే యువకుడు...  అతని మిత్రుడు యాక్టివా పై వెళుతుండగా వెనక నుండి కారు బలంగా ఢీకొట్టింది. దాంతో ఇరువురు తీవ్ర గాయాలపాలయ్యారు పటాన్చెరువు లేని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా భాను కండిషన్ సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు వారి బంధువులు. కాగా గాంధీ ఆస్పత్రిలో వైద్యులు బతికి ఉన్న భాను చనిపోయినట్లు ధ్రువీకరించారు. ప్రమాదం కావడంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్న సమయంలో భాను బ్రతికి ఉన్నట్లుగా గుర్తించాడు కానిస్టేబుల్. దాంతో వైద్యుల తీరు పై మండిపడ్డారు భాను బంధువులు.