క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన  జ‌ర్న‌లిస్టులు

క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన  జ‌ర్న‌లిస్టులు..
అక్రిడేష‌న్ ర‌ద్దుచేయ్య‌డం అన్యాయం..

            మేడ్చల్  జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన  జ‌ర్న‌లిస్టులు. ప్ర‌భుత్వానికి వ్య‌తి రేఖ వార్త రాసాడ‌న్న నేపంతో మేడ్చ‌ల్ జిల్లా ఈనాడు ప్ర‌తినిధి భానుచంద‌ర్ రెడ్డి అక్రిడేష‌న్  కార్డును ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు జారీచేసిన క‌లెక్ట‌ర్ చ‌ర్య‌ల‌కు నిర‌స‌న‌గా  ఆందోళ‌న చేశారు జ‌ర్న‌లిస్టులు. ఈ చ‌ర్య‌లు టియుడ‌బ్ల్యూజె తీవ్రంగా కండిస్తుంద‌ని నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. కోద్ది రోజుల క్రితం ఈవియంల త‌ర‌లింపు పై వార్త‌రాశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై కోద్ది మంది జ‌ర్న‌లిస్టుల‌పై  కేసులు న‌మోదు చేసిన అధికారులు ఇప్పుడు ఆక్రిడేష‌న్ ర‌ద్దు చేశారు. ప్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల్లోనే ఇలాంటి చ‌ర్య‌లకు అధికారులు పాల్ప‌డుతున్నార‌ని యునియ‌న్ నేత‌లు ఆరోపించారు.