కుల రహిత సమాజం కోసం రన్
హైదరాబాద్: కుల నిర్మూలన సమాజం కోసం, అణగారిన దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డాక్టర్ అంబేడ్కర్ జయంతిని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. అంతర్జాతీయ ప్రబుద్ధ భారత్ సంస్థ ఆధ్వర్యంలో కుల రహిత సమాజం కోసం టీ షర్టులు ధరించి రన్ చేపట్టారు. పీపుల్స్ ప్లాజా నుంచి లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున రన్లో యువకులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి పాల్గొని జెండా ఊపి పరుగు ప్రారంభించారు.