కార్మికులను సత్కరించిన మేయర్

బల్దియా కార్మికులను సత్కరించిన మేయర్

కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణి

              మ‌ల్లాపూర్‌లో హ‌మాలీ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో జిహెచ్‌ఎంసి శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జి, వాట‌ర్ వ‌ర్క్స్‌, విద్యుత్ స‌ర‌ఫ‌రా విభాగాల‌కు చెందిన 300 మంది కార్మికుల‌కు నిత్య‌వ‌స‌రాల‌ను పంపిణీ చేశారు మేయర్ బోంతు రామ్మోహన్.  అనంతరం కార్మికులను శాలువాలతో సత్కరించారు మేయర్ .  ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ ఛైర్మ‌న్ ఎం.శ్రీ‌నివాస్‌రెడ్డి, కార్పొరేట‌ర్ పి.దేవేంద‌ర్‌రెడ్డిలు పాల్గొన్నారు. వారితో క‌లిసి మ‌ల్లాపూర్‌లో ఉన్న పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ గోడౌన్‌ను ప‌రిశీలించారు.   బియ్యం నిల్వ‌లు సంమృద్దిగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో జిహెచ్‌ఎంసి శానిటేష‌న్‌, గోడౌన్ లో ప‌నిచేస్తున్నహ‌మాలీ వ‌ర్క‌ర్స్‌ను స‌త్క‌రించారు.​