కరోనా బారిన పడ్డ సీఎం కేసిఆర్...

   తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫాంహౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నారని, కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. కేసీఆర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. కుటుంబ సభ్యులు, ఇటీవల ఆయనను కలిసిన వారు, సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. అటు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో పాల్గొన్న పలువురు నేతలకు ఇప్పటికే కరోనా సోకింది.