కపుకాసి కత్తులతో నరికి చంపారు.....

    పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో దారుణం జరిగింది. కారులో హైదరాబాద్‌కు వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు హత్యకు గురయ్యారు. కారు ఆపి దంపతులిద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పరారయ్యారు. కారులోనే విచక్షణారహితంగా కత్తులతో నరికిచంపిన దుండగులు. మంథని కోర్టులో ఓ కేసుకు హజరైన గట్టు వామన్​ రావు, నాగమణి దంపతులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్​ వెళ్తుండగా కల్వచర్ల శివారులో కారును అడ్డుకొని ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.