ఓపెనింగ్ సర్మనీ లో ఇండియన్ అతిలేట్స్ పరేడ్
ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో భాగంగా అందులో పాల్గొనే అన్ని దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పరేడ్లో ప్రాచీన, ఆధునిక ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్ టీమ్ అందరి కంటే ముందు ఉంటుంది. ఇడియన్ టీమ్ తరఫున మొత్తం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు ఈ పరేడ్లో పాలుపంచుకున్నారు. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన బాక్సర్ మేరీ కోమ్, హాకీ టీమ్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకంతో ముందు నడిచారు. ఎన్నడూలేని విధంగా ఈసారి 127 మంది అథ్లెట్ల బృందంతో ఇండియా వెళ్లినా.. ఓపెనింగ్ సెర్మనీలో మాత్రం వారి సంఖ్య 19కే పరిమితమైంది.