ఐఫోన్ అందకపాయే..

ఐఫోన్ అందకపాయే..

ఒక్కోఫోన్ కు 1.60లక్షలు ఖర్చుచేయ్యాలని నిర్ణయం 

 

          జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు తమకు ఆపిల్ ఫోన్ కావాలని తీర్మాణం చేసుకుని ఒకే చేసుకున్నారు. అయితే వాటికి అధికారులు అడ్డుకుట్ట వేశారు.  ఐఫోన్‌ కొనుగోళ్లపై స్టాండింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని   నిలిపివేసినట్లు మునిసిపల్‌ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌ లో పేర్కోన్నారు.   జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి స్టాండింగ్‌ కమిటీ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టినట్లు చెప్పుకోచ్చారు. 

             జీహెచ్‌ంఎసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు 15 మందితోపాటు మేయర్, డిప్యూటీ మేయర్‌లకు, ముగ్గురు అధికారులకు   ఐఫోన్   12 ప్రో ‌ మోడల్‌ 512 జీబీ సెల్ ఫోన్లు  బహుమతిగా ఇచ్చేందుకు  గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మీడియాలో.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావాడంతో అధికారులు ఆనిర్ణయాన్ని హోల్డ్ చేశారు.