ఎస్ ఆర్ డి పి పనుల్లో వేగం పెంచండి.

 

                వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పథకంలో చెపట్టిన పనుల్లో వేగం పెంచాలని బల్దియా ప్రాజెక్టు విభాగం అధికారులను ఆదేశించారు మేయర్ బోంతు రామ్మోహన్. నగరంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఎస్ఆర్డిపి ప్రాజెక్టు పనులను అధికారులు.., స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు మేయర్. లాక్ డౌన్ నేపథ్యంలో పనుల్లో ఎలాంటి అటంకం లేదని డే అండ్ నైట్ వర్క్ చేయ్యాలని ఆదేశించారు. అయితే వర్క్ సమయంలో సామాజిక దూరం పాటించాలని అధికారులకు సూచించారు మేయర్.