ఈవీఎంల పనితీరుపై చాలా సందేహాలున్నాయి : చంద్రబాబు

న్యూఢిల్లీ : ఈవీఎంల పనితీరుపై చాలా సందేహాలున్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వీవీపాట్ ను 50 శాతం లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందంటూ కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. మళ్లీ రివ్యూపిటిషన్ వేయబోతున్నామని చెప్పారు. వీవీపాట్ లో గుర్తు 7 సెకండ్లు ఉండాల్సి ఉండగా కేవలం మూడు సెకండ్లు మాత్రమే కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. సమయం ఎందుకు మారిందంటే ఈసీ దగ్గర సమాధానం లేదని ఆయన అన్నారు. లక్షల రూపాయలు వ్యయం చేసి వీవీపాట్ లు కొనుగోలు చేశారనీ, లెక్కించమంటే నియోజకవర్గానికి ఒకటి లెక్కిస్తామంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.