అమల్లోకి టిఎస్ బిపాస్

 

తెలంగాణలో అమల్లోకి టిఎస్ బిపాస్. 

సత్వర అనుమతులకోసం.

అవినీతి నిర్మూలన కోసం.


మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో టి ఎస్ బి పాస్ ని ప్రారంభించారు పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు   సెల్ప్ సర్టిఫికేషన్ విధానంలో భవన నిర్మాణాలకు అనుమతులు పొందిన పలువురికి అనుమతి పత్రాలను అందజేశారు మంత్రి కేటిఆర్.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల పరిపాలనా సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు  తెలంగాణలోని 43 శాతం జనాభా పట్టణ ప్రాంతంలో ఉన్నదని,  రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలు సింహభాగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసించే అవకాశం ఉన్నదన్నారు. అందుకు అనుగుణంగా  పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన చేపడుతూనే మరోవైపు అధికార వికేంద్రీకరణ ద్వారా పౌరులకి మంచి సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్   అనేక సంస్కరణలు చేపట్టారన్నారు మంత్రి. ఆమేరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

           ప్రజలకు మేలు చేసే చట్టాలను ఏర్పాటు చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చునని, ఈ స్పూర్తితోనే టియస్ బిపాస్ వంటి నూతన చట్టాలను తీసుకు వస్తున్నామని,  ఒక్క పైస ఇచ్చే అవకాశం, అవసరం లేకుండా... గతంలో నెలల సమయం పట్టే రిజిస్ట్రేషన్లు ఈరోజు అత్యంత పారదర్శకంగా ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్నాయన్నారు మంత్రి కేటిఆర్.   తెలంగాణ ప్రభుత్వ చట్టాలను, విధానాలను కేంద్ర ప్రభుత్వం తో పాటు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు.  టి ఎస్ బి పాస్ ద్వారా ఏ విధంగా అయితే విజయవంతంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే అద్భుతమైన సంస్కరణ చేపట్టినామో, అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణాల కోసం టీయస్ బి పాస్ తీసుకువచ్చాము అన్నారు మంత్రి.   ఈ విధానంతో సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా   అనుమతులు లభిస్తాయి. 

                 

                 75 గజాల నుంచి 600 గజాల వరకు స్వీయ ధృవీకరణ ద్వారా అనుమతి వస్తుంది.  600 గజాలపైన 21 రోజుల్లో అనుమతి లబిస్తుందని ఎదైనా ఆలస్యం జరిగితే అనుమతి లభించినట్లుగానే భావించి నిర్మాణం చేసుకోవచ్చన్నారు మంత్రి కేటిఆర్.   ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధ్రువీకరణలు, అబద్ధాలు, తప్పుడు ధ్రువీకరణ చేస్తే భవన నిర్మాణాలను ఎలాంటి నోటీసు లేకుండా కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నదన్నారు.  ప్రభుత్వం ఎంత విశ్వాసంతో  ప్రజల నుండి స్వీయ దృవీకరణ అవకాశం ఇచ్చినదో అంతే విశ్వాసంతో ప్రజలంతా దీని అనుసరిస్తారని ఆశిస్తున్నామన్నారు.  పట్టణాలు పెరుగుతున్న మేరకు క్రమబద్ధీకరణ, ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరగకపోవడంతో మొన్న వచ్చిన వరదల వంటివి పదేపదే వస్తున్నాయన్నారు. అందుకే నూతన జిహెచ్ఎంసి చట్టంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం కొన్ని కఠినమైన నిబంధనలను చేర్చబోతున్నామని.., ఇప్పటికే కొత్తగా మున్సిపల్, పంచాయతీ రాజ్, రెవెన్యూ వంటి చట్టాలు తీసుకువచ్చాం... త్వరలో నూతన జిహెచ్ఎంసి చట్టాన్ని తీసుకురాబోతున్నామన్నారు.  టీడీ అర్ బ్యాంక్ ఏర్పాటు, ఏకీకృత సర్వీస్ రూల్స్ వంటివి తీసుకువచ్చాము. ఇవన్నీ ప్రజలందరికీ మెరుగైన పౌర సేవలు అందించడం కోసమే తీసుకురావడం జరిగింది అన్నారు మంత్రి కేటిఆర్.   ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టి ఎస్ బి పాస్ చట్టం, విధానం దేశంలోనే అత్యుత్తమ భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియగా నిలువబోతున్నదన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరానికి ఉన్నంత ఉజ్వల భవిష్యత్తు ఏ ఇతర మెట్రో నగరానికి కూడా లేదన్నారాయానా.