అదుపుతప్పి బోల్తా పడిన టిప్పర్
తూర్పు గోదావరి : టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. చిత్రాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో రౌతులపూడి నుండి కాకినాడ కు కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ లకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.